ఆర్జీయూకేటీలో ప్రమాదం

బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మంజీర వసతి గృహంలో గురువారం ఫాల్స్‌సీలింగ్‌ పలకలు ఊడి పడటంతో పీయూసీ మొదటి సంవత్సరం

Published : 12 Aug 2022 05:24 IST

ఫాల్స్‌సీలింగ్‌ పలకలు ఊడిపడి విద్యార్థికి గాయాలు

ముథోల్‌, న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మంజీర వసతి గృహంలో గురువారం ఫాల్స్‌సీలింగ్‌ పలకలు ఊడి పడటంతో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీమత్‌ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి విద్యార్థులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.  విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని ఆర్జీయూకేటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు గతంలో ఆందోళన చేసినప్పుడు పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థులుండే గదులు, వసతి గృహాలకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు.అధికారులు  ఎలాంటి మరమ్మతులు చేయించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని