చెన్నై విమానాశ్రయంలో రూ.100 కోట్ల మత్తుపదార్థాల స్వాధీనం
ఇథియోపియా నుంచి చెన్నై విమానాశ్రయానికి అక్రమంగా తీసుకొచ్చిన రూ.వంద కోట్ల విలువైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఐయూ అధికారులు తెలిపారు. వారు
చెన్నై (ట్రిప్లికేన్), న్యూస్టుడే: ఇథియోపియా నుంచి చెన్నై విమానాశ్రయానికి అక్రమంగా తీసుకొచ్చిన రూ.వంద కోట్ల విలువైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఐయూ అధికారులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం..శనివారం ఇథియోపియా నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఇక్బాల్ భాషా అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. అతను తీసుకొచ్చిన చెప్పులు, లోదుస్తులు, తదితర చోట్ల దాచిన 9.59 కిలోల కొకైన్, హెరాయిన్ వంటి మత్తుపదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.వంద కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!