కోతి మూక చేష్టలకు నిండు ప్రాణం బలి
వానర గుంపు చేసిన విధ్వంసం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో వరంగంటి
ఐనవోలు, న్యూస్టుడే: వానర గుంపు చేసిన విధ్వంసం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో వరంగంటి కమలాకర్రెడ్డి నివాసంపైకి శనివారం రాత్రి కోతుల గుంపు చేరింది. ఇంట్లో సామగ్రిని చెల్లాచెదురు చేసింది. ఈ క్రమంలో ఇంటికి సంబంధించిన విద్యుత్తు తీగలు చెదిరిపోయాయి. ఆదివారం కమలాకర్రెడ్డి భార్య రజిత(45) ఇంటి వెనక తీగపై దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. అది గమనించిన భర్త వెంటనే వచ్చి తప్పించే ప్రయత్నం చేయగా ఆయనకు కూడా షాక్ కొట్టింది. కుటుంబ సభ్యులు చూసి కమలాకర్రెడ్డిని కర్రతో తప్పించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. రజిత అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ జి.వెంకన్న తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్