విద్యార్థిని చావబాదిన ఉపాధ్యాయుడు

విచక్షణ కోల్పోయిన ఓ ఉపాధ్యాయుడు స్వాతంత్య్ర దినోత్సవం రోజునే విద్యార్థిని చావబాదాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు శ్రీవేణుగోపాల ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా

Published : 17 Aug 2022 03:52 IST

మార్టేరు (పెనుమంట్ర), న్యూస్‌టుడే: విచక్షణ కోల్పోయిన ఓ ఉపాధ్యాయుడు స్వాతంత్య్ర దినోత్సవం రోజునే విద్యార్థిని చావబాదాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు శ్రీవేణుగోపాల ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థులంతా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందడిలో ఉన్న సమయంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రవీంద్ర పదో తరగతి విద్యార్థి బేతి బన్నీని అకారణంగా చెంప పైనా, వీపుపైనా కొట్టారు. సహచర ఉపాధ్యాయులు చూసి అడ్డుకున్నారు. స్పృహ కోల్పోయిన బన్నీకి పాఠశాల సిబ్బంది సపర్యలు చేశారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక వైద్య చేయించి ఇంటికి పంపారు. ఆ విద్యార్థి సంరక్షకుడు విజయకాంత్‌ మంగళవారం పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో హెచ్‌ఎం శివజ్యోతికి ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థికి మద్దతుగా విద్యార్థులంతా మంగళవారం తరగతులు బహిష్కరించి ఉపాధ్యాయుడు రవీంద్ర తమకొద్దంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎం హామీ ఇచ్చారు. గతంలో పనిచేసిన పాఠశాలలోనూ రవీంద్ర వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని