కన్నపేగు గాయపడిందని.. తండ్రి గుండె చెదిరింది!

గోడ కూలిన ప్రమాదంలో కుమారుడికి గాయాలయ్యాయని తెలియడంతో హతాశుడైన తండ్రి హఠాన్మరణం చెందారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెదమార్కెట్‌లో ఉన్న శిథిల గోదాము గోడ మంగళవారం

Published : 17 Aug 2022 03:52 IST

సాలూరు, న్యూస్‌టుడే: గోడ కూలిన ప్రమాదంలో కుమారుడికి గాయాలయ్యాయని తెలియడంతో హతాశుడైన తండ్రి హఠాన్మరణం చెందారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెదమార్కెట్‌లో ఉన్న శిథిల గోదాము గోడ మంగళవారం ఉదయం కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే టీ తాగుతున్న ఇజ్జాడ వెంకటరావు, జాను అప్పలస్వామినాయుడు, పూడి గోపి తీవ్రంగా గాయపడ్డారు. గోపికి గాయాలై ఆసుపత్రిలో చేరినట్లు ఆయన తండ్రి అప్పలనాయుడు(72)కు స్థానికులు సమాచారం అందించారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడికి ఏమైందోనని రోదిస్తూ.. అప్పలనాయుడు ఇంట్లోనే ప్రాణాలొదినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని