చిన్నారుల స్కూల్ బస్సుపై దుండగుల దాడి
సుమారు 30 మంది స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు దుండగులు దాడి చేశారు. బైక్పై కత్తులతో వెంబడిస్తూ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. అతడికి స్వల్ప గాయాలు కాగా బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ హఠాత్పరిణామంతో చిన్నారులు
సుమారు 30 మంది స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు దుండగులు దాడి చేశారు. బైక్పై కత్తులతో వెంబడిస్తూ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. అతడికి స్వల్ప గాయాలు కాగా బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ హఠాత్పరిణామంతో చిన్నారులు భయకంపితులయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ బర్నాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు తనతో గొడవ పడ్డారని.. అందుకు ప్రతీకారంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని బస్సు డ్రైవర్ చెప్పాడు. బస్సును ఆపాలంటూ నిందితులు వెంటపడ్డారని.. పదునైన కత్తులతో తనపై దాడి చేశారని బాధితుడు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. నిందితులను గుర్తించామని.. వారిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు