రూ.500 కోసం స్నేహితుడి హత్య

ఇద్దరు స్నేహితుల మధ్య రూ.500 కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితుడి తల నరికిన నిందితుడు దాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. అస్సాం సోనిట్‌పుర్‌ జిల్లాలోని దయాల్‌పుర్‌ గ్రామంలో

Updated : 18 Aug 2022 06:06 IST

తలనరికి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన నిందితుడు

ఈనాడు, గువాహటి: ఇద్దరు స్నేహితుల మధ్య రూ.500 కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితుడి తల నరికిన నిందితుడు దాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. అస్సాం సోనిట్‌పుర్‌ జిల్లాలోని దయాల్‌పుర్‌ గ్రామంలో ఆగస్టు 15న అర్ధరాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మాద్రి, హేమ్రామ్‌ స్నేహితులు. రూ.500 కావాలని మాద్రిని హేమ్రామ్‌ అడిగాడు. నిరాకరించిన మాద్రిని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మాద్రి తన దగ్గర ఉన్న కత్తితో హేమ్రామ్‌ మెడపై వేటు వేసి తన తల నరికేశాడు. దాన్ని సంచిలో పట్టుకొని 10 కి.మీ. నడిచి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని