హత్యాచార నిందితుడిని చంపిన స్థానికులు
ఓ హత్యాచారం కేసులో కోర్టుకు తీసుకువచ్చిన నిందితుడు.. పోలీసుల కళ్లగప్పి తప్పించుకోగా స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటన అస్సాంలోని ఉత్తర లఖింపుర్లో గురువారం
ఉత్తర లఖింపుర్: ఓ హత్యాచారం కేసులో కోర్టుకు తీసుకువచ్చిన నిందితుడు.. పోలీసుల కళ్లగప్పి తప్పించుకోగా స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటన అస్సాంలోని ఉత్తర లఖింపుర్లో గురువారం చోటుచేసుకుంది. గెర్జాయ్ బారువా(45)ను హత్యాచారం కేసులో విచారణ నిమిత్తం మంగళవారం ఢక్వాఖానా జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకురాగా, మరుగుదొడ్డికి వెళ్లి అక్కడినుంచి పారిపోయాడు. కిలాకిలి గ్రామ సమీపంలో ఓ ప్రవాహం వద్ద గెర్జాయ్ దాక్కుని ఉండగా గ్రామస్థులు అతణ్ని పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులకు అక్కడకు వచ్చేలోపు వారు గెర్జాయ్పై దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM