Andhra News: స్మగ్లర్‌ వద్ద 200 కిలోల గంజాయి.. ఏకే 47..

ఏపీలో మన్యం నుంచి మైదాన ప్రాంతానికి కారులో రవాణా చేస్తున్న 200 కిలోల గంజాయితోపాటు స్మగ్లర్‌ వద్దనున్న ఏకే47 తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 19 Aug 2022 11:06 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఏపీలో మన్యం నుంచి మైదాన ప్రాంతానికి కారులో రవాణా చేస్తున్న 200 కిలోల గంజాయితోపాటు స్మగ్లర్‌ వద్దనున్న ఏకే47 తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పాడేరు ఎస్‌ఈబీ, టాస్క్‌ఫోర్సు అధికారులు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట మార్గంలో తనిఖీలు చేశారు.

ఆ సమయంలో తడిగిరి గ్రామ సమీపంలో పోలీసులను చూసి ఇద్దరు నిందితులు.. కారు నడుస్తుండగానే దాన్ని రోడ్డుపై వదిలి పరారయ్యారు. అది రోడ్డు పక్కన బోల్తాపడింది. కారును ద్విచక్రవాహనంపై అనుసరిస్తున్న నిందితుల సహచరుడు ముంచంగిపుట్టు మండలం కొండపడ గ్రామానికి చెందిన స్మగ్లర్‌ గణేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని