Hyd News: గాంధీ సినిమాకి వచ్చి థియేటర్‌ ధ్వంసం

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో మల్లేపల్లిలోని ప్రియా థియేటర్‌లో శుక్రవారం ప్రదర్శించిన గాంధీ సినిమా చూసేందుకు వచ్చిన విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు.

Updated : 20 Aug 2022 07:55 IST

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో మల్లేపల్లిలోని ప్రియా థియేటర్‌లో శుక్రవారం ప్రదర్శించిన గాంధీ సినిమా చూసేందుకు వచ్చిన విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. మెహిదీపట్నంలోని ఎంఎస్‌ కళాశాలకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థులు శుక్రవారం ఉదయం ఆట చూసేందుకు వచ్చారు. సినిమా చూస్తున్న విద్యార్థులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. సీట్లు చించేసి.. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. థియేటర్‌ నిర్వాహకులు.. విద్యార్థులను వారించినా ఫలితం లేకపోయింది. థియేటర్‌ మేనేజరు మాజీద్‌ రజ్వీ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని