Andhra News: ఉన్మాదిలా మారిన కుమారుడిని కడతేర్చిన తండ్రి

కుమారుడి చిత్రహింసలను తట్టుకోలేకపోయిన ఆ తండ్రి అతడిని కడతేర్చిన సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కిళ్లాం గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 22 Aug 2022 07:42 IST

కిళ్లాం (నరసన్నపేట గ్రామీణం), న్యూస్‌టుడే: కుమారుడి చిత్రహింసలను తట్టుకోలేకపోయిన ఆ తండ్రి అతడిని కడతేర్చిన సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కిళ్లాం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన గొలివి సూర్యనారాయణ, పోలమ్మ దంపతులకు కుమారుడు రాము(33)తో పాటు, ఇద్దరు వివాహితులైన కుమార్తెలు ఉన్నారు. రాము గతంలో భారత సైనిక దళంలో పనిచేశాడు. అతని ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. భార్య సైతం అతని ప్రవర్తనతో విసుగుచెంది విడాకులు తీసుకుంది. భార్య దూరం కావడం, ఉద్యోగం పోవడంతో ఉన్మాదిలా మారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను ఇబ్బందిపెట్టేవాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో తల్లి పోలమ్మతో గొడవ పడటంతో, తండ్రి సూర్యనారాయణతో పాటు గ్రామస్థులు అతన్ని వారించారు. అయినా వినకుండా ఆమెను విచక్షణారహితంగా కొట్టి హింసించడంతో గాయాలపాలైంది. అది చూసి తట్టుకోలేకపోయిన తండ్రి.. ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డుతో రాము తలపై మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం సూర్యనారాయణ పోలీసుస్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని