Andhra News: మద్యం మత్తులో కన్నప్రేమ చిత్తు.. కారు చీకట్లో పిల్లలను వదిలేసిన తండ్రి
అల్లారు ముద్దుగా పెంచి, చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి... మానవత్వం మరచి కన్న కుమారులను చిమ్మచీకట్లో వదిలేశాడు. మద్యం మత్తులో ఆయన చేసిన పనికి...
భార్యనూ కొట్టి రోడ్డుపై పడేసిన దారుణం
కోడుమూరు పట్టణం, న్యూస్టుడే: అల్లారు ముద్దుగా పెంచి, చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి... మానవత్వం మరచి కన్న కుమారులను చిమ్మచీకట్లో వదిలేశాడు. మద్యం మత్తులో ఆయన చేసిన పనికి... అభం శుభం తెలియని చిన్నారులు రాత్రంతా చలికి వణుకుతూ అల్లాడిపోయారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో నివాసముంటున్న కృష్ణ, సుజాత దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో ఒక కుమార్తె, నలుగురు కుమారులు. కృష్ణ మద్యానికి బానిసయ్యాడు. అనుమానంతో భార్యను నిత్యం వేధించేవాడు. సోమవారం రాత్రి ఆమెతో గొడవపడి దారుణంగా కొట్టాడు. మద్యం మత్తులో జోగుతూ భార్య, ఇద్దరు కుమారులు బంటు(3), మహేంద్ర(5)లను ఆటోలో ఎక్కించుకుని ఊరికి దూరంగా వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక భార్యను దించేసి, ఆమెపై మరోసారి దాడిచేశాడు. ఆమెకు స్పృహ తప్పడంతో అక్కడే వదిలేసి వెళ్లాడు. కుమారులను 5కిలోమీటర్ల దూరంలోని ప్యాలకుర్తిలోని దిగువ కాల్వ గట్టు వద్ద వదిలేశాడు. చిమ్మచీకట్లో పిల్లలిద్దరూ భయంతో వణికిపోయారు. తెల్లవారుజామున పొలాలకు నీరుపెట్టేందుకు అటుగా వచ్చిన ప్యాలకుర్తి రైతు లక్ష్మీనారాయణ... పిల్లల ఆర్తనాదాలు విని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైవే పోలీసులు వచ్చి, చిన్నారులను చేరదీశారు. పిల్లలు తమ తల్లి గురించి చెప్పగా పోలీసులు వెళ్లి రక్షించారు. మంగళవారం కృష్ణను స్టేషన్కు పిలిపించారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ చేసి, చిన్నారులను అప్పగించారు. విషయం తెలిసి బాలల సంరక్షణ నిర్వాహకులు కూడా ఠాణాను సందర్శించి, చిన్నారులను చేరదీసేందుకు ముందుకొచ్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?