అగ్నిప్రమాదంపై ముమ్మర దర్యాప్తు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
రూబీ హోటల్ ఘటనలో నలుగురు నిందితుల అరెస్టు..
ఈనాడు, హైదరాబాద్ - రెజిమెంటల్ బజార్, న్యూస్టుడే: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైన అంశాలపై పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాలు విచారణ చేపట్టాయి.
కొత్తచోటు.. చీకటితెచ్చిన చేటు
రూబీ హోటల్ సెల్లార్లో రాజుకున్న నిప్పు, పొగలు క్షణాల్లో పై అంతస్తుల్లోని గదుల్లోకి వ్యాపించాయి. ప్రమాదం సంభవించిన సమయంలో 23 గదుల్లో 25 మంది ఉన్నారు. కొందరు నిద్రలోకి జారుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, పొగ వాసన రావటంతో మెలకువగా ఉన్నవారంతా బయటకు వచ్చారు. 9 మంది గదుల్లోనే ఉండిపోయారు. గదుల్లోని వారు టెర్రస్పైకి చేరాలంటూ తెలుగు/హిందీ భాషల్లో పోలీసులు కేకలు వేసినా.. వారు బయటకు రాలేకపోయారు. కొత్త ప్రాంతం కావటంతో అవగాహన లేక.. ఏం చేయాలో పాలుపోక, ఊపిరాడక చీకట్లో ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఫామ్హౌస్కు పరార్..
రూబీ ప్రైడ్ హోటల్ యజమాని రంజిత్సింగ్. తన ఇద్దరు కుమారులు సునీత్సింగ్, సుప్రీత్సింగ్లతో కలిసి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రే హోటల్ నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మేడ్చల్లోని ఫామ్హౌస్లో తలదాచుకున్న నలుగురు నిందితులను మంగళవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాలో అప్పగించారు. సెల్లార్లో పేలుడు, 8 మంది మరణానికి కారకులైన ఐదుగురు నిందితుల్లో రూబీ ప్రైడ్ హోటల్ భవన యజమాని రంజిత్సింగ్(60), ఆయన కుమారుడు సునీత్సింగ్ అలియాస్ సుమిత్సింగ్(34), మేనేజర్ నరిడ్ల సుదర్శన్నాయుడు(39), క్యాషియర్ జస్పాల్సింగ్ గులాటి(59)లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ షోరూం యజమాని(ఏ3) సుప్రీత్సింగ్(30) పరారీలో ఉన్నట్టు ఇన్స్పెక్టర్ వై.నాగేశ్వర్రావు తెలిపారు.
ప్రేమజంట తిప్పలు
అకస్మాత్తుగా గదిలోకి పొగరావటంతో ఉక్కిరిబిక్కిరైన యువతి(25), యువకుడు(29) కిటికీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సిమెంట్ పైపు పట్టుకొని అతికష్టమ్మీద కిందకు దూకారు. ఆ ఇద్దరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తాము ఆరోగ్యంగా ఉన్నామని.. ఇంటికి పంపాలంటూ మంగళవారం రాత్రి వారు వైద్యులను ప్రాధేయపడ్డారు. అనంతరం పోలీసులు ఆ జంటను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. చిరునామా తీసుకొని పంపారు. వారిద్దరూ ప్రేమజంటగా పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్