Kollapur: బిడ్డలను చంపిన భర్తను కడతేర్చిన భార్య

పిల్లలను చంపేసి, తనపై హత్యాయత్నానికి పాల్పడిన భర్త గొంతు కోసి భార్య హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో ఆదివారం

Updated : 19 Sep 2022 08:21 IST

కొల్లాపూర్‌, కొల్లాపూర్‌ పట్టణం, కోడేరు, న్యూస్‌టుడే: పిల్లలను చంపేసి, తనపై హత్యాయత్నానికి పాల్పడిన భర్త గొంతు కోసి భార్య హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.

పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. కొల్లాపూర్‌ మండలం కుడికిల్లకు చెందిన ఓంకార్‌(39)కు మహేశ్వరి మూడో భార్య. ఆమెకు  ఇది రెండో వివాహం. వీరిద్దరికి కుమార్తె చందన (3), కుమారుడు విశ్వనాథ్‌ (1) ఉన్నారు. అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో ఇద్దరూ తరుచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న ఓంకార్‌ తన ఇద్దరు పిల్లలను కోడేరు మండలం ఎత్తం గుట్ట వద్ద గొంతుకోసి చంపి తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ ఘటనలో మహేశ్వరి తప్పించుకొని పారిపోయింది.

హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో చికిత్స పొందిన ఓంకార్‌ ఈనెల 16న కుడికిల్లకు వచ్చాడు. బిడ్డలను హతమార్చినవాడు తననూ చంపుతాడని భయపడిన భార్య మహేశ్వరి ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఓంకార్‌ను చంపేసింది. అనంతరం కొల్లాపూర్‌ ఠాణాకు వెళ్లి లొంగిపోయింది. మృతుడి తల్లి బాలకిష్టమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని