Crime News: వృద్ధురాలి మెడలో గొలుసు దొంగిలించిన వైకాపా నాయకుడు..

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ గాంధీనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఒంటరిగా ఉంటున్న మస్తానమ్మ అనే వృద్ధురాలి మెడలో మూడున్నర

Updated : 24 Sep 2022 10:12 IST

 సీసీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి..

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ గాంధీనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఒంటరిగా ఉంటున్న మస్తానమ్మ అనే వృద్ధురాలి మెడలో మూడున్నర సవర్ల బంగారు గొలుసు గురువారం చోరీ అయింది. ఈ గొలుసును దొంగిలించిన వ్యక్తిని సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్‌ కార్యాలయంలో నిందితుడిని శుక్రవారం సీఐ సీహెచ్‌ కోటేశ్వరరావు విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధి గాంధీనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న మస్తానమ్మ మెడలో బంగారు గొలుసును స్థానిక శాంతినగర్‌కు చెందిన బెల్లం అనిల్‌కుమార్‌రెడ్డి దొంగిలించాడని వివరించారు. అతను వైకాపా నాయకుడు. నగర పంచాయతీలో తాత్కాలిక ప్రాతిపదికన శానిటరీ పర్యవేక్షకుడిగా పనిచేసి మానేశాడు. ఆటో యూనియన్‌ అధ్యక్షుడిగానూ పని చేశాడు. ఇతని భార్య వాలంటీరు. ఈమె పింఛన్లు ఇచ్చే సమయంలో తోడుగా వెళ్లేవాడు. ఆ సమయంలో పింఛను కోసం వచ్చిన వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు ఉండటం గమనించి గురువారం చోరీకి పాల్పడ్డాడు. ప్లోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని