విద్యార్థినిని బెదిరించి.. ఉపాధ్యాయుడి కీచకపర్వం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ఓ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఒక విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల
గర్భం దాల్చిన పదోతరగతి బాలిక?
పోక్సో కేసు నమోదు
దమ్మపేట, న్యూస్టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ఓ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఒక విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన బాలిక ఆ పాఠశాలలో పదోతరగతి చదువుకుంటోంది. ఆ బాలికపై కన్నేసిన ఉపాధ్యాయుడు పిచ్చయ్య పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, తన మాట వినకపోతే చంపుతానని బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఇంటికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించారు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థినిని నిలదీయడంతో బాలిక పాఠశాలలో జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. దీంతో విద్యార్థిని తల్లి దమ్మపేట పోలీస్స్టేషన్లో శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు పిచ్చయ్యపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ప్రతాప్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి