మావోయిస్టు దళ సభ్యుడి లొంగుబాటు
మావోయిస్టు దళ సభ్యుడు మడకం అడమయ్య అలియాస్ రింకు పోలీసులకు లొంగిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులోని ఏఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీశ్కుమార్
చింతూరు, న్యూస్టుడే: మావోయిస్టు దళ సభ్యుడు మడకం అడమయ్య అలియాస్ రింకు పోలీసులకు లొంగిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులోని ఏఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీశ్కుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ జగ్గారం గ్రామానికి చెందిన రింకు 2019లో మావోయిస్టు పార్టీలో చేరారు. ప్రస్తుతం శబరి ఎల్వోఎస్ దళ సభ్యుడిగా పనిచేస్తున్నారు. మావోయిస్టు సిద్ధాంతాలపై విసుగు చెంది, అగ్రనేతలు చేయిస్తున్న పనులతో విరక్తితో జన జీవన స్రవంతిలో కలవాలని రింకు నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈయనపై రూ.లక్ష రివార్డు ఉందని, అది ప్రభుత్వం నుంచి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రంపచోడవరం ఓఎస్డీ కృష్ణకాంత్, చింతూరు ఏఎస్పీ మహేశ్వర్రెడ్డి, ఎటపాక సీఐ గజేంద్రకుమార్, సీఆర్పీఎఫ్ 40 బెటాలియన్ కమాండెంట్ సీవీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్