పందులదాడిలో వృద్ధురాలి మృతి
పందులు దాడి చేయడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన వైయస్ఆర్ జిల్లాలోని పుణ్యక్షేత్రం బ్రహ్మంగారిమఠంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు
బ్రహ్మంగారిమఠం, న్యూస్టుడే: పందులు దాడి చేయడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన వైయస్ఆర్ జిల్లాలోని పుణ్యక్షేత్రం బ్రహ్మంగారిమఠంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బ్రహ్మంగారిమఠంలోని తపాలా కార్యాలయం వీధిలో నాగిరెడ్డి సిద్దమ్మ(80) నివాసం ఉన్నారు. ఆమె ఎప్పటిలాగే ఆరుబయట మంచంపై నిద్రపోతుండగా ఉదయం పది గంటల సమయంలో అల్పాహారం పెట్టాలని కుమార్తె అంతకుముందే ఇంటి లోపలికి వెళ్లారు. ఆ సమయంలో పందుల గుంపు సిద్దమ్మపై దాడి చేసింది. దీంతో స్పృహ కోల్పోయారు. ఇంటి బయట అలికిడి విని కుమార్తె బయటికి వచ్చారు. పందుల గుంపును చూసి గట్టిగా కేకలు వేశారు. ఆమె అరుపులు విని ఇరుగుపొరుగు వారు వచ్చి పందులను తరిమారు. అప్పటికే వృద్ధురాలి చెవిని, చేతి వేళ్లను కొరికేశాయి. సిద్దమ్మను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..