ప్రిన్సిపాల్పై ఇంటర్ విద్యార్థి కాల్పులు
ఉత్తర్ప్రదేశ్లోని సీతాపుర్లో దారుణం జరిగింది. మందలించాడన్న కోపంతో కళాశాల ప్రిన్సిపాల్పై ఓ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ ఘటన జహంగీరాబాద్లోని సదర్పుర్ పోలీస్స్టేషన్ పరిధిలో
సీతాపుర్: ఉత్తర్ప్రదేశ్లోని సీతాపుర్లో దారుణం జరిగింది. మందలించాడన్న కోపంతో కళాశాల ప్రిన్సిపాల్పై ఓ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ ఘటన జహంగీరాబాద్లోని సదర్పుర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదర్శ్ రామ్స్వరూప్ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య శుక్రవారం గొడవ జరిగింది. అందులో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై దాడి చేశాడు. ఈ విషయం కళాశాల ప్రిన్సిపాల్ రామ్ సింగ్ వర్మ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఓ విద్యార్థిని పిలిచి మందలించాడు. ఈ క్రమంలో కోపం పెంచుకున్న అతను శనివారం.. కళాశాలకు తుపాకీ తెచ్చుకున్నాడు. అనంతరం ప్రిన్సిపాల్పై కాల్పులు జరిపాడు. రామ్సింగ్కు తల, కడుపు, నడుము భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రిన్సిపాల్ను లఖ్నవూ అసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీతాపుర్ అదనపు ఎస్పీ ఎన్పీ సింగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్