ఊయలే ఉరితాడై చిన్నారి మృతి
ఆడుకుంటున్న ఊయలే చిన్నారి పాలిట ఉరితాడైంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో ఆదివారం చోటుచేసుకుంది. కుమార్తెల దినోత్సవం రోజునే జరిగిన ఈ ప్రమాదంతో ఆ కుటుంబంలో
పెనుగంచిప్రోలు, న్యూస్టుడే: ఆడుకుంటున్న ఊయలే చిన్నారి పాలిట ఉరితాడైంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో ఆదివారం చోటుచేసుకుంది. కుమార్తెల దినోత్సవం రోజునే జరిగిన ఈ ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గోపి, తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి లలితశ్రీ (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో పిల్లలను ఇంటివద్దే ఉంచి దంపతులిద్దరూ పొలం పనులకు వెళ్లారు. చిన్నారులకు తోడుగా తాతయ్య ఉన్నారు. ఇంటి వసారాలో చీరతో వేసిన ఊయలతో లలితశ్రీ ఆడుకుంటూ ఉండగా ఆ చీర ఆమె మెడకు చుట్టుకుంది. దీంతో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన స్థానికులు వెంటనే లలితశ్రీని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు