ఊయలే ఉరితాడై చిన్నారి మృతి

ఆడుకుంటున్న ఊయలే చిన్నారి పాలిట ఉరితాడైంది. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో ఆదివారం చోటుచేసుకుంది. కుమార్తెల దినోత్సవం రోజునే జరిగిన ఈ ప్రమాదంతో ఆ కుటుంబంలో

Published : 26 Sep 2022 04:49 IST

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: ఆడుకుంటున్న ఊయలే చిన్నారి పాలిట ఉరితాడైంది. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో ఆదివారం చోటుచేసుకుంది. కుమార్తెల దినోత్సవం రోజునే జరిగిన ఈ ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గోపి, తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి లలితశ్రీ (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో పిల్లలను ఇంటివద్దే ఉంచి దంపతులిద్దరూ పొలం పనులకు వెళ్లారు. చిన్నారులకు తోడుగా తాతయ్య ఉన్నారు. ఇంటి వసారాలో చీరతో వేసిన ఊయలతో లలితశ్రీ ఆడుకుంటూ ఉండగా ఆ చీర ఆమె మెడకు చుట్టుకుంది. దీంతో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన స్థానికులు వెంటనే లలితశ్రీని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని