కారు డ్రైవరు బీభత్సం
ఓ కారు డ్రైవరు అతివేగం, నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులు సహా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. ఈ దుర్ఘటన ఏలూరు- జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై కామవరపుకోట మండలం రావికంపాడువద్ద ఆదివారం చోటుచేసుకుంది.
అతివేగంగా వాహనం నడిపి రెండు ద్విచక్ర వాహనాలు, మరో కారును ఢీకొట్టిన వైనం
తండ్రి, ఇద్దరు చిన్నారులు మృతి.. తల్లికి తీవ్ర గాయాలు
కామవరపుకోట, జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్టుడే: ఓ కారు డ్రైవరు అతివేగం, నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులు సహా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. ఈ దుర్ఘటన ఏలూరు- జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై కామవరపుకోట మండలం రావికంపాడువద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన నూకా ఉమామహేశ్వరరావు భార్య రేవతి, పిల్లలు షర్మిల, దుర్గాప్రసాద్తో కలిసి ద్విచక్ర వాహనంపై ఆదివారం బుట్టాయగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలోని గుబ్బలమంగమ్మ దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో రావికంపాడు సమీపంలోకి రాగానే జంగారెడ్డిగూడెంవైపు అతి వేగంగా వస్తున్న కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారులు షర్మిల (10), దుర్గాప్రసాద్ (8) ఎగిరి పక్కనే ఉన్న చెట్టుకు బలంగా తాకి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఉమామహేశ్వరరావు (30)ను తొలుత జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తుండగా మరణించారు. రేవతిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. వీరి వాహనాన్ని ఢీకొట్టిన కారు.. వెనుక వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని, ఏలూరు వైపు వెళుతున్న మరో కారును ఢీకొట్టింది. వాటిలో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరు పరారయ్యాడు. ఈ ఘటనలో ఉమామహేశ్వరరావు కుటుంబం ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం కాలిపోవడం ప్రమాద తీవ్రతను చాటిచెప్పింది. ప్రమాదం గురించి తెలుసుకున్న రావికంపాడు వాసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రహదారికి ఆనుకుని ఉన్న చెట్ల కారణంగా ఈ ప్రదేశంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!