దిల్లీలో బాలుడిపై సామూహిక వికృత అత్యాచారం

దేశరాజధాని దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ అసహజ లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురూ మైనర్లే కావడం గమనార్హం. వీరు ఎంత వికృతంగా ప్రవర్తించారంటే

Published : 26 Sep 2022 05:05 IST

ప్రైవేటు భాగాల్లో రాడ్డుతో దాడి

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ అసహజ లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురూ మైనర్లే కావడం గమనార్హం. వీరు ఎంత వికృతంగా ప్రవర్తించారంటే చివరకు బాలుడి రహస్య భాగంలో రాడ్డును కూడా దూర్చారు. అనంతరం ఇటుకలు, రాడ్డులతో కొట్టి తీవ్రంగా హింసించారు. ఈ సంఘటన ఈ నెల 17న చోటు చేసుకుంది.బాధిత బాలుడు ఇంకా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నిందితులంతా 10-12 సంవత్సరాల మధ్యవారేనని, ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ముందు హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. దీనిపై దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ ట్వీట్‌ చేస్తూ... దేశరాజధానిలో అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ రక్షణ లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు