భర్త కళ్లెదుటే భార్యపై ఆరుగురు వ్యక్తుల అత్యాచారం
భర్త కళ్లెదుటే ఓ మహిళ ఆరుగురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన ఝార్ఖండ్లో పలము ప్రాంతంలోని సాత్బర్వా పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పలము: భర్త కళ్లెదుటే ఓ మహిళ ఆరుగురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన ఝార్ఖండ్లో పలము ప్రాంతంలోని సాత్బర్వా పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భర్తపై ఆగ్రహించిన భార్య లటేహర్ప్రాంతంలోని మాణికలో గల తన పుట్టింటికి బయలుదేరింది. దీంతో తన భార్యను వెతుక్కుంటూ ఆ వ్యక్తి బైక్పై సాత్బర్వా ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ నడిచి వెళ్తున్న ఆమెను గమనించి ఇంటికి తిరిగిరావాలంటూ ఒప్పించేందుకు బతిమలాడుతున్నాడు. అదే సమయానికి ఆ మహిళ బావ కూడా అక్కడికి చేరుకున్నాడు. వారిద్దరు ఆమెకు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆరుగురు యువకులు అక్కడికి చేరుకుని ఆ ముగ్గురిని దగ్గరలో స్టోన్క్రషర్ కర్మాగారంలోకి తీసుకుపోయారు. అక్కడ వారు మహిళ బావను తీవ్రంగా కొట్టారు. దీంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. వివాహిత భర్తను కూడా నిందితులు చావబాదారు. అనంతరం ఒకరి తరువాత ఒకరు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. కొద్దిసేపటికి ఎలాగోలా తప్పించుకున్న భర్త పరుగెత్తి పోలీసు గస్తీ బృందాన్ని చేరుకుని జరిగిన దారుణాన్ని వివరించాడు. దీంతో పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM