అరవై ఏళ్ల వయసులో రెండు హత్యలు

మహిళలపై దాడులు చేసి వారి నగలను అపహరించడంతో పాటు ఇద్దరిని హత్య చేసిన నిందితుడిని నిజామాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 27 Sep 2022 04:44 IST

ఘరానా హంతకుడి అరెస్టు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: మహిళలపై దాడులు చేసి వారి నగలను అపహరించడంతో పాటు ఇద్దరిని హత్య చేసిన నిందితుడిని నిజామాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కమిషనరేట్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌లోని నాగారానికి చెందిన అల్లెపు మల్లయ్య అలియాస్‌ రాజు(60) కొంతకాలంగా దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్నాడు. ఆగస్టు 24న మాక్లూర్‌ మండలం డీకంపల్లి వద్ద పత్తి లక్ష్మి(56) మృతదేహం లభించింది. మల్లయ్య, అతని అల్లుడు పోశెట్టి ఆమెను హతమార్చారని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించగా మల్లయ్య గతంలోనూ ఒక మహిళను హత్య చేసినట్లు, మరికొందరిపైనా దాడులు చేసినట్లు తేలింది. 2019లో జక్రాన్‌పల్లిలో ఓ మహిళ తలపై దాడి చేసి నగలు అపహరించుకెళ్లాడు. 2020లో ముప్కాల్‌ మండలంలో మహిళను హత్య చేసి నగలు దోచుకెళ్లాడు. ఈ ఏడాది జులైలో కామారెడ్డి జిల్లా లింగంపేటలో కిరాణా దుకాణంలో ఉన్న మహిళపై దాడి చేసి నగలు ఎత్తుకెళ్లాడు. మల్లయ్య నుంచి పోలీసులు 15 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై 16 కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని