పోలీసుల అదుపులో నయీం అనుచరుడు శేషన్న

కరడు కట్టిన నేరగాడు, మాజీ నక్సలైట్‌ నయీం  ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.....

Published : 27 Sep 2022 04:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరడు కట్టిన నేరగాడు, మాజీ నక్సలైట్‌ నయీం  ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తపేటలోని ఓ రెస్టారెంట్లో సెటిల్‌మెంట్‌ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. శేషన్న నుంచి ఓ పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న కొంతకాలం పీపుల్స్‌ వార్‌ గ్రూపులో పని చేసి తర్వాత లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. అప్పటి నుంచి నయీం ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ అనేక నేరాల్లో భాగస్వామిగా ఉన్నాడు. బెదిరింపులు, హత్యలు, హత్యాయత్నాల వంటి అనేక కేసుల్లో నయీంతో పాటు శేషన్న నిందితుడు. 2016లో షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం మరణించాడు. అప్పటి నుంచి శేషన్న పరారీలో ఉన్నాడు. విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు శేషన్నను పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని