యూపీలో ట్రాక్టర్ తిరగబడి ఇద్దరు చిన్నారులు, 8మంది మహిళల మృతి
ట్రాక్టర్ తిరగబడి ఇద్దరు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ జిల్లా అసన్హా ప్రాంతంలో సోమవారం జరిగింది.
లఖ్నవూ: ట్రాక్టర్ తిరగబడి ఇద్దరు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ జిల్లా అసన్హా ప్రాంతంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 37మంది కూడా క్షతగాత్రులయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు 47 మంది కలిసి ట్రాక్టర్లో సమీపంలోని దుర్గాదేవి గుడికి బయలుదేరారు. మార్గమధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న చెరువులో పడిపోయింది. దీంతో మొత్తం 10 మంది మరణించగా మిగిలిన వారిని స్థానికులు రక్షించారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని జిల్లా కలెక్టర్ సూర్యపాల్ గాంగ్వార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM