Suicide: ఆరు నెలల్లోనే ముగిసిన వైవాహిక బంధం.. నవదంపతుల ఆత్మహత్య
ఆరు నెలల్లోనే ఆ జంట వైవాహిక బంధం ముగిసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా
పెద్దఅడిశర్లపల్లి, న్యూస్టుడే: ఆరు నెలల్లోనే ఆ జంట వైవాహిక బంధం ముగిసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పడమటితండాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పడమటితండాలో గుడి పూజారిగా పనిచేసే రమావత్ బాలోజీ మొదటి భార్య కుమారుడు లక్ష్మణ్(24)కు నేరెడుగొమ్ము మండలం కొత్తపల్లికి చెందిన పాల్తి సురేందర్, బామ్నిల కుమార్తె నిఖిత(20)తో ఆరు నెలల క్రితం వివాహమైంది. మొదటి భార్య చనిపోవడంతో పన్నెండేళ్ల క్రితం బాలోజీ.. రెండో వివాహం చేసుకున్నారు. లక్ష్మణ్.. గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో లక్ష్మణ్, నిఖిత కొద్దిరోజులుగా దిగాలుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మణ్ బంగారు ఆభరణాల రుణం కోసం కొండమల్లేపల్లికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికే నిఖిత ఉరేసుకుని కనిపించడంతో లక్ష్మణ్ సైతం ఉరేసుకున్నట్లు తెలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న నిఖిత బంధువులు గ్రామానికి చేరుకుని ఆత్మహత్యలపై అనుమానం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. గుడిపల్లి ఎస్సై పి.వీరబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇంకా ఫిర్యాదు అందలేదని, కేసు దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి