వీఆర్‌ఏ ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని నిరసన శిబిరంలో శనివారం గుండ్రపల్లి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ ఖాసిం ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ.. రెండు నెలలుగా వీఆర్‌ఏలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.

Published : 02 Oct 2022 04:59 IST

నెక్కొండ, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని నిరసన శిబిరంలో శనివారం గుండ్రపల్లి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ ఖాసిం ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ.. రెండు నెలలుగా వీఆర్‌ఏలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. నెక్కొండ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో ఖాసిం సైతం పాల్గొంటున్నారు. తమ సమస్యలు ఇక పరిష్కారం కావేమోనన్న మనోవేదనతో శనివారం ఆయన శిబిరంలో బ్లేడుతో గొంతుకోసుకున్నారు. సహచర వీఆర్‌ఏలు ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఖాసిం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని