Murder: కూరలో ఉప్పు తక్కువైందని భార్య దారుణహత్య

బిహార్‌లో సారన్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కూరలో ఉప్పు తక్కువగా ఉందని కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురాం.. భార్య వంట చేసింది. పొరపాటున కూరలో ఉప్పు కొద్దిగా తక్కువగా వేసింది.

Updated : 02 Oct 2022 07:58 IST

బిహార్‌లో సారన్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కూరలో ఉప్పు తక్కువగా ఉందని కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురాం.. భార్య వంట చేసింది. పొరపాటున కూరలో ఉప్పు కొద్దిగా తక్కువగా వేసింది. భోజన సమయంలో కూరలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై ప్రభురాం కోప్పడ్డాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన భర్త.. ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు ప్రభురాంను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు