దేవుడు బలిమ్మన్నాడంటూ దారుణం
దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ధర్మేంద్ర అనే ఆరేళ్ల బాలుడిని గొంతుకోసి హత్య చేశారు. దక్షిణ దిల్లీలోని లోధి కాలనీలో నిర్మాణంలో ఉన్న సీఆర్పీఎఫ్ కేంద్ర కార్యాలయం భవనం సమీపంలో ఈ దారుణం జరిగింది.
గొంతుకోసి ఆరేళ్ల బాలుడి హత్య
దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ధర్మేంద్ర అనే ఆరేళ్ల బాలుడిని గొంతుకోసి హత్య చేశారు. దక్షిణ దిల్లీలోని లోధి కాలనీలో నిర్మాణంలో ఉన్న సీఆర్పీఎఫ్ కేంద్ర కార్యాలయం భవనం సమీపంలో ఈ దారుణం జరిగింది. విజయ్కుమార్, అమర్కుమార్ అనే ఇద్దరు యువకులు శనివారం రాత్రి ఈ దురాగతానికి ఒడిగట్టారు. భవన నిర్మాణ కార్మికులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది వారిని పట్టుకుని ప్రశ్నించగా.. పరమశివుడు బలి ఇవ్వాల్సిందిగా కోరాడని, అందుకే బాలుడిని గొంతు కోసి హత్య చేశామని బదులిచ్చారు. నిందితులు బిహార్కు చెందినవారుగా గుర్తించారు. శంకరుడికి, దుర్గామాతకు జీవులను బలిస్తే అద్భుతాలు జరుగుతాయంటూ నిందితులు గతంలో చెప్పినట్లు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట