బొడ్డు కోయబోయి.. బిడ్డ వేలు కోశారు!
బొడ్డు కోయబోయి బిడ్డ వేలు కోసేసిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్వరూప అనే మహిళ గత నెల 30న ఈ ఆసుపత్రిలో తొలి కాన్పు కోసం చేరి బాబుకు జన్మనిచ్చింది.
మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
మాచర్ల గ్రామీణ, న్యూస్టుడే: బొడ్డు కోయబోయి బిడ్డ వేలు కోసేసిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్వరూప అనే మహిళ గత నెల 30న ఈ ఆసుపత్రిలో తొలి కాన్పు కోసం చేరి బాబుకు జన్మనిచ్చింది. ఆమె స్పృహలోకి రాక ముందే బొడ్డు తాడు కోసే క్రమంలో సిబ్బంది పసికందు కుడి చేతి చిటికెన వేలు కోసేశారు. వెంటనే గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాబు వేలు చివర్లోతెగిందని, శస్త్రచికిత్స చేసి అతికిస్తామని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ విషయం బయటకురాకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారు. దీనిపై వైద్య విధాన పరిషత్ పల్నాడు జిల్లా సమన్వయకర్త డాక్టర్ బీవీ రంగారావును ‘న్యూస్టుడే’ సంప్రదించగా విషయం తమ దృష్టికి వచ్చిందని.. ఈ ఘటనకు కారకురాలైన పారిశుద్ధ్య కార్మికురాలిని విధుల నుంచి తొలగించామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన కాన్పులో పారిశుద్ధ్య కార్మికురాలు బొడ్డుతాడు కోయడమేంటనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. విచారణ తర్వాత నిజానిజాలు తేలే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్