విహారయాత్రలో విషాదం

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్‌ బస్సు.. కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో అయిదుగురు విద్యార్థులు, ఓ టీచర్‌.. ముగ్గురు ప్రయాణికులు మరణించారు.

Published : 07 Oct 2022 05:00 IST

అయిదుగురు విద్యార్థులు సహా 9 మంది మృతి

పాలక్కడ్‌: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్‌ బస్సు.. కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో అయిదుగురు విద్యార్థులు, ఓ టీచర్‌.. ముగ్గురు ప్రయాణికులు మరణించారు. పాలక్కడ్‌ జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 40 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టూరిస్టు బస్సు 97 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ ఓ కారును దాటేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని