అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం అంకంపల్లి ఉపసర్పంచి, రైతు ఆకుల సదయ్య(38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

Updated : 07 Oct 2022 05:57 IST

కాల్వశ్రీరాంపూర్‌, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం అంకంపల్లి ఉపసర్పంచి, రైతు ఆకుల సదయ్య(38) ఆత్మహత్యకు పాల్పడ్డారు.  సదయ్య తన నాలుగెకరాల్లో వరి, పత్తి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాగునీటి కోసం గతంలో రెండు బోరుబావులు, వ్యవసాయ బావిని తవ్వించినా నీళ్లు రాలేదు. వీటికోసం రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. పంటలు పండక, అప్పులు తీర్చే దారి లేక  ఆందోళనకు గురవుతున్న ఆయన ఈ నెల 2న పురుగుల మందు తాగారు.  చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. సదయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని