పింఛను ఇప్పిస్తానంటూ మోసాలు.. పాత నిందితుడి అరెస్ట్‌

పింఛను ఇప్పిస్తానంటూ వృద్ధులను మోసం చేస్తున్న వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సై వెంకటేశ్వర్లు గురువారం ఈ వివరాలు వెల్లడించారు.

Updated : 07 Oct 2022 05:55 IST

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: పింఛను ఇప్పిస్తానంటూ వృద్ధులను మోసం చేస్తున్న వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సై వెంకటేశ్వర్లు గురువారం ఈ వివరాలు వెల్లడించారు. సిద్దిపేటలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన అల్లెపు కృష్ణ(45).. ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ గ్రామానికి చెందిన పుట్ట లక్ష్మికి పింఛను ఇప్పిస్తానంటూ గత నెలలో రూ.7 వేలు తీసుకున్నాడు. మండల కేంద్రంలోని బద్ద లక్ష్మికి సైతం ఇలానే చెప్పి బంగారు ఆభరణాలు తీసుకొని ఆచూకీ లేకుండా పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిపై ఉమ్మడి రాష్ట్రంలో 102 కేసులు నమోదు కాగా..19 కేసుల్లో శిక్ష పడినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని