Nizamabad: సైకిల్ పుల్లతో ఖరీదైన బండ్లు మాయం!
పక్కనున్న ద్విచక్ర వాహనాలు షోరూం ముందు ప్రదర్శనకు ఉంచినవో..లేక పార్కింగ్లో ఉన్నవో కావు. ఓ ముఠా కొట్టేసినవి.
రూ.70 లక్షల విలువైన 42 వాహనాల స్వాధీనం
న్యూస్టుడే, నిజామాబాద్ నేరవార్తలు: పైనున్న ద్విచక్ర వాహనాలు షోరూం ముందు ప్రదర్శనకు ఉంచినవో..లేక పార్కింగ్లో ఉన్నవో కావు. ఓ ముఠా కొట్టేసినవి. నిజామాబాద్ పోలీసులు నలుగురిని సోమవారం అరెస్టుచేసి 42 బండ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అక్షరాలా రూ.70 లక్షలు. అధునాతన వాహనమైనా, రెండేసి తాళాలున్నా ఈ ముఠా సభ్యులకు బలాదూర్. ఖరీదైన బండి కంటపడితే చాలు..క్షణాల్లో ఎత్తుకెళ్లే ఈ ముఠా చాకచక్యాన్ని చూసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు.
తాళంచెవి లేకపోయినా..‘సైకిల్ పుల్ల’ వాడి అపహరిస్తారని నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. నిజామాబాద్కు చెందిన షేక్ సమీదుద్దీన్, రియాజ్లు వాహనాలు దొంగిలించి కర్ణాటక, మహారాష్ట్రలలో తక్కువ ధరకు విక్రయిస్తున్నారని, వీరికి బాన్సువాడకు చెందిన అబ్బాస్, హైదరాబాద్కు చెందిన అద్నాన్ బిన్ సహకరిస్తున్నారని చెప్పారు. ఒక బుల్లెట్ అపహరణకు సంబంధించి సీసీ టీవీ దృశ్యాలు లభించగా గాలింపు జరిపి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకోవడం జిల్లాలో ఇదే మొదటిసారని చెప్పారు. ముఠా అపహరించిన బండ్లన్నీ ఏడాది క్రితం కొన్నవేనని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!