Kurnool: ఎస్సైని ఢీకొట్టి.. 30 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి..
కర్నూలు జిల్లా పత్తికొండ-ఆదోని ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం ఆటో ఢీకొన్న ప్రమాదంలో పత్తికొండ ఎస్సై గోపాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనాల తనిఖీలో భాగంగా రహదారి పక్కన ఎస్సై సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నారు.
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: కర్నూలు జిల్లా పత్తికొండ-ఆదోని ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం ఆటో ఢీకొన్న ప్రమాదంలో పత్తికొండ ఎస్సై గోపాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనాల తనిఖీలో భాగంగా రహదారి పక్కన ఎస్సై సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నీళ్ల క్యాన్లతో వేగంగా వచ్చిన ఆటో ఎస్సైని ఢీకొట్టింది. సుమారు 30 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలతో రహదారిపై పడిన ఎస్సైని హుటాహుటిన పోలీసు వాహనంలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖంపై కండరం చిట్లిపోవడంతో కుట్లు వేశారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఆటోడ్రైవర్ రామాంజనేయులను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని