ప్రేమజంటను బలిగొన్న కుటుంబసభ్యులు
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో శనివారం రాత్రి ఓ ప్రేమ జంటను వారి కుటుంబసభ్యులే గొంతు కోసి హత్య చేశారు.
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో శనివారం రాత్రి ఓ ప్రేమ జంటను వారి కుటుంబసభ్యులే గొంతు కోసి హత్య చేశారు. కమల్గంజ్ పోలీస్ స్టేషన్లోని రాజేపుర్ సరైమెడ గ్రామానికి చెందిన భయ్యా లాల్ జాతవ్ 15 ఏళ్ల కుమార్తె శివాని, మహావీర్ జాతవ్ కుమారుడు రామ్కరణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. దీంతో వారిని ఓ కంట కనిపెడూతూ వచ్చారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి శివాని కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న కుటుంబసభ్యులకు ఊరి బయటనున్న మామిడితోటలో ప్రేమజంట కనిపించింది. దీంతో ఆగ్రహం చెందిన కుటుంబసభ్యులు వారిద్దరినీ సింగిరాంపుర్ గ్రామ సమీపంలోని ఖాంతా నాలా వద్దకు తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశారు. బాలిక సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పొదల్లో ఉన్న మృతదేహాలను వెలికితీశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?