రోడ్డు ప్రమాదంలో ఎస్సై అభ్యర్థి దుర్మరణం

పోలీసు ఉద్యోగం సాధించి కన్నవారి కలలను తీర్చడంతో పాటు భార్యాబిడ్డను మంచిగా పోషించుకోవాలనే ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి.

Published : 25 Nov 2022 05:10 IST

కురవి, న్యూస్‌టుడే: పోలీసు ఉద్యోగం సాధించి కన్నవారి కలలను తీర్చడంతో పాటు భార్యాబిడ్డను మంచిగా పోషించుకోవాలనే ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ఎస్సై శరీర దారుఢ్య పరీక్షల కోసం సాధన చేసి ఇంటికి వస్తుండగా లారీ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదనపల్లికి చెందిన కొర్ల వెంకన్న, సుభద్ర దంపతుల కుమారుడు శివకృష్ణ(30) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. కష్టపడి చదివి కానిస్టేబుల్‌తో పాటు ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. శరీర దారుఢ్య పరీక్షల కోసం కురవిలోని పాఠశాల మైదానంలో రోజూ సాధన చేస్తున్నారు. గురువారం సాయంత్రం సాధన ముగించి ఇంటికి వస్తూ మార్గమధ్యలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఒక డీసీఎం డ్రైవర్‌తో మాట్లాడుతున్నారు. అదే సమయంలో మరిపెడ వైపు నుంచి ధాన్యం లోడుతో ఉన్న లారీ వేగంగా వచ్చి డీసీఎంను ఢీకొట్టింది. డీసీఎం అతనిపై నుంచి వెళ్లగా తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా శివకృష్ణ మృతి చెందారు. లారీ రోడ్డు పక్కనే ఉన్న చెప్పుల దుకాణంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మృతుడికి భార్య యమున, నెల రోజుల పాప ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని