Crime News: చిన్నారిని చంపి రక్తం తాగిన మహిళ..
అయిదేళ్ల క్రితం చిన్నారిని చంపి రక్తం తాగిన కేసులో ఓ మహిళకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. క్షుద్రపూజల పేరుతో ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి ఈ దారుణానికి పాల్పడింది.
అయిదేళ్ల తర్వాత జీవితఖైదు విధించిన న్యాయస్థానం
అయిదేళ్ల క్రితం చిన్నారిని చంపి రక్తం తాగిన కేసులో ఓ మహిళకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. క్షుద్రపూజల పేరుతో ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి ఈ దారుణానికి పాల్పడింది. ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పుర్ జిల్లా రోజా పోలీస్స్టేషన్ పరిధిలోని జముకా గ్రామంలో ధన్దేవి అనే మహిళ పదేళ్ల బాలుడిని చంపి రక్తం తాగింది. 2017 డిసెంబరు 5న ఈ ఘటన జరిగింది.
తన పొరుగింట్లో ఉండే లాల్దాస్ అనే పదేళ్ల చిన్నారికి.. టీవీ చూపిస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లో పెట్టి తాళం వేసింది. అనంతరం క్షుద్రపూజలు నిర్వహించి బాలుడి గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత చెంపను కోసి రక్తాన్ని తాగి.. మృతదేహాన్ని ఇంటి ముందు పడేసింది. ఈ హత్యతో సంబంధం ఉన్న ధన్దేవీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వారందరికీ జిల్లా కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్