రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి
అప్పుల బాధ భరించలేక రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వారిలో భర్త మృతి చెందారు. భార్య కోలుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
చొప్పదండి, న్యూస్టుడే: అప్పుల బాధ భరించలేక రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వారిలో భర్త మృతి చెందారు. భార్య కోలుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంగి బీరయ్య (32) రూ.15 లక్షల వరకు అప్పులు చేసి ట్రాక్టర్, హార్వెస్టర్ కొనుగోలు చేశారు. పంట దిగుబడులు రాక, యంత్రాలపై నష్టాల నేపథ్యంలో ఈ నెల 24న పొలం వద్ద పురుగుమందు తాగారు. ఇది గమనించిన ఆయన భార్య సుజాత సైతం పురుగు మందు తాగారు. స్థానికులు వారిద్దరిని ఆసుపత్రిలో చేర్పించగా సుజాత కోలుకున్నారు. బీరయ్య హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు
-
Movies News
butta bomma review: రివ్యూ: బుట్టబొమ్మ
-
Politics News
Raghunandanrao: వారికి రూ.5 లక్షలు కాదు.. రూ.7.50 లక్షలు ఇవ్వండి: ఎమ్మెల్యే రఘునందన్రావు
-
India News
Bomb blast: సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs PAK: 2015 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ అలా అన్నాడు: సోహైల్