అరకు ఘాట్రోడ్డులో ప్రైవేటు బస్సు దగ్ధం
అరకు లోయ నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.
అనంతగిరి సమీపంలో అర్ధరాత్రి ఘటన
పర్యాటకులకు తప్పిన ముప్పు
అనంతగిరి గ్రామీణం, న్యూస్టుడే: అరకు లోయ నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్రోడ్డులో.. అనంతగిరి సమీపంలో మూడో నంబరు మలుపు దాటిన తర్వాత ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. విజయనగరం మండలం గొల్లలపేటకు చెందిన 24 మంది పర్యాటకులు ఓ ప్రైవేటు బస్సులో అరకులోయ, బొర్రా గుహలు చూసి తిరుగు ప్రయాణమయ్యారు. టైడా దాటిన తర్వాత వీరి బస్సు వెనకాల చక్రాల మధ్య మంటలు చెలరేగి ఒక టైరు పేలిపోయింది. దీంతో ప్రయాణికులు బస్సును నిలిపివేయాలని డ్రైవరుకు చెప్పారు. అప్పటికే మంటలు తీవ్రం కావడంతో డ్రైవరు ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వెంటనే మంటలు ఎగసిపడి బస్సు పూర్తిగా కాలిపోయింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!