అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాగు కోసం చేసిన అప్పులు అధికమవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడుజిల్లా మాచర్ల మండలం రాయవరంలో సోమవారం చోటుచేసుకుంది.
రాయవరం (మాచర్ల గ్రామీణ), న్యూస్టుడే: సాగు కోసం చేసిన అప్పులు అధికమవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడుజిల్లా మాచర్ల మండలం రాయవరంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన జగడాల మల్లికార్జునరావు(35) తన మూడెకరాల సొంత పొలంతోపాటు ఎకరన్నర కౌలుకు తీసుకొని పంటసాగు కోసం అప్పులు చేశారు. ఈ క్రమంలో రూ.7లక్షల వరకు అప్పులున్నట్లు తెలిసింది. ఒత్తిడి తట్టుకోలేక ఇంటివద్ద పురుగుమందు తాగారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు