బాలికతో అసభ్య ప్రవర్తన.. హెచ్ఎంకు దేహశుద్ధి
విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పెద్దలు దేహశుద్ధి చేసిన వైనమిది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది.
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్టుడే: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పెద్దలు దేహశుద్ధి చేసిన వైనమిది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. పాతగుంటూరు ఆనందపేటకు చెందిన షేక్ అబ్దుల్ షాజహాన్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరిస్తున్నాడు. చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక వారం రోజులుగా పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతుండటంతో తల్లి జ్వరం అని భావించి తొలుత మందులు వేసింది. తర్వాత ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది. బాలిక కుటుంబసభ్యులు, పెద్దలు గురువారం పాఠశాల వద్దకు వచ్చి ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. అందరూ కలసి దేహశుద్ధి చేశారు. పట్టాభిపురం పోలీసులు వచ్చి నిందితుడికి ఆసుపత్రిలో చికిత్స చేయించి అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం