బీమా డబ్బుల కోసం భార్య హత్య..

బీమా డబ్బుల కోసం భార్యను భర్త చంపించిన దారుణ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 02 Dec 2022 07:08 IST

బీమా డబ్బుల కోసం భార్యను భర్త చంపించిన దారుణ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్‌ చాంద్‌ అనే వ్యక్తి తన భార్య షాలుపై రూ.1.90 కోట్లకు 40 ఏళ్ల కాలానికి బీమా చేయించాడు. ఆమెను చంపి ప్రమాదం జరిగినట్లు నమ్మిస్తే బీమా డబ్బును పొందొచ్చని కుట్ర పన్నాడు. అందుకు ఓ కిరాయి హంతకుణ్ని పురమాయించాడు. రూ.10 లక్షలు సుపారీ మాట్లాడుకుని రూ.5.5 లక్షలను చెల్లించాడు. అక్టోబరు 5న షాలును గుడికి వెళ్లమని కోరిన భర్త.. ఆమె మోటార్‌ సైకిల్‌పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టించి చంపాడు. ఈ ఘటనలో ఆమె సోదరి తీవ్రంగా గాయపడగా బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశామని తెలిపిన పోలీసులు.. ఇది హత్యే అని తేలినట్లు వివరించారు. చాంద్‌, షాలుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని, గతంలో షాలు.. చాంద్‌పై గృహహింస కేసు కూడా పెట్టిందని వారు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని