విద్యుదాఘాతానికి ఏనుగు మృతి

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె సమీప మామిడి తోటలో విద్యుదాఘాతంతో 20ఏళ్ల ఏనుగు మరణించింది.

Published : 03 Dec 2022 04:14 IST

బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె సమీప మామిడి తోటలో విద్యుదాఘాతంతో 20ఏళ్ల ఏనుగు మరణించింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. నాలుగు ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు మేత కోసం టేకుమంద అటవీ ప్రాంతం మొగిలివారిపల్లె సమీపంలోని మామిడితోటపై గురువారం రాత్రి దాడి చేసింది. ఆపై టేకుమంద అటవీ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నంలో తోటలో ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించింది. దీన్ని శుక్రవారం సాయంత్రం గుర్తించి అటవీ అధికారులకు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని