అటవీ అధికారి ద్విచక్ర వాహనం దహనం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మాళకుంట పొలాల్లో అటవీశాఖాధికారి ద్విచక్రవాహనాన్ని శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు.
పెనుబల్లి, న్యూస్టుడే: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మాళకుంట పొలాల్లో అటవీశాఖాధికారి ద్విచక్రవాహనాన్ని శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. పెనుబల్లికి సమీప మండలమైన భద్రాద్రి జిల్లా చంద్రగొండ మండలం ఎర్రబోడులో ఇటీవల ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు గురికాగా... అక్కడికి 12 కి.మీ. దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మాళకుంట అటవీప్రాంతం సమీపంలో ఉన్న మామిడితోటలో వన్యమృగాల వేటకు ఆగంతుకులు విద్యుత్తు తీగలు అమర్చుతున్నారని లింగగూడెం సెక్షన్ అధికారి బానోత్ కాళీకి సమాచారం అందింది. ఆయన సిబ్బంది ఇద్దరిని తీసుకొని అక్కడకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. బైక్ను పంట పొలాల్లో ఉంచి లోపలకు వెళ్లారు. మామిడి తోట పక్కన జంతువుల వేటకు అమర్చిన తీగలను గుర్తించి తొలగిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనానికి ఎవరో వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై బాధితుడు బానోత్ కాళీ వి.ఎం.బంజర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!