ప్రాణాలు తీసిన రీల్స్‌ వ్యసనం!

ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లో శనివారం ప్రమాదకరంగా ఇన్‌స్టా రీల్స్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు.. రైలు కిందపడి మరణించారు.

Updated : 05 Dec 2022 06:11 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లో శనివారం ప్రమాదకరంగా ఇన్‌స్టా రీల్స్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు.. రైలు కిందపడి మరణించారు. మరణించినవారిని మైన్‌పురి జిల్లాలోని భికాన్‌పుర్‌ గ్రామానికి చెందిన కరణ్‌, శశాంక్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ ధోల్‌పురా గ్రామానికి కూలీ పనుల కోసం వెళ్లారు. రీల్స్‌ కోసం పట్టాల దగ్గర వీడియోలు చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరూ చెవుల్లో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకున్నారు. దీంతో వారికి రైలు వస్తున్న శబ్దం వినపడలేదు. అనంతరం వారిద్దరినీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని