మహిళపై సామూహిక అత్యాచారం.. కత్తితో దాడి
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 42 ఏళ్ల మహిళ ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ప్రైవేటు భాగాలపై సిగరెట్ వాతలు
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 42 ఏళ్ల మహిళ ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పదునైన ఆయుధంతో గాయపరచడంతోపాటు ప్రైవేటు భాగాలపై సిగరెట్తో వాతలు పెట్టారు. కుర్లా ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితులు అదే ప్రాంతానికి చెందినవారని చెప్పారు. ‘‘నిందితులు ఒకరి తర్వాత ఒకరు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ప్రైవేటు భాగాలపై సిగరెట్తో వాతలు పెట్టారు. ఆయుధంతో ఛాతీపైన, రెండు చేతులపైన గాయపరిచారు. ఈ తతంగాన్ని వీడియో తీశారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే వీడియోను బయటపెడతామని బెదిరించారు’’ అని వెల్లడించారు. తన దుస్థితిని బాధితురాలు ఇరుగుపొరుగు వారికి చెప్పుకొని బాధపడగా, కొందరు ఓ స్వచ్ఛంద సంస్థకు తెలియజేశారు. అనంతరం కుర్లా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.