భార్యపై పైశాచికం..

మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తన భార్యపై చేయి చేసుకోవడమే కాకుండా ఆమె ప్రైవేట్‌ భాగాల్లోకి ఓ ప్లాస్టిక్‌ వస్తువును చొప్పించాడు.

Published : 07 Dec 2022 06:18 IST

ప్రైవేటు భాగాల్లో ప్లాస్టిక్‌ వస్తువు చొప్పించిన నిందితుడు

మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తన భార్యపై చేయి చేసుకోవడమే కాకుండా ఆమె ప్రైవేట్‌ భాగాల్లోకి ఓ ప్లాస్టిక్‌ వస్తువును చొప్పించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ములుంద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో తూలుతున్న భర్తకు సపర్యలు చేసేందుకు ముందుకు వచ్చిన భార్యను విచక్షణారహితంగా కొట్టిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఆమెను అసహజ శృంగారంలో పాల్గొనమని బలవంతపెట్టాడు. ప్రతిఘటించడంతో ఆమె ప్రైవేట్‌ భాగాల్లోకి ఓ ప్లాస్టిక్‌ పైపు లాంటి వస్తువును చొప్పించాడు. నొప్పిని భరించలేక ఆ మహిళ ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఆరాతీయడంతో అసలు విషయం బయటపెట్టింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని