యువతిపై సామూహిక అత్యాచారం
ప్రభుత్వ కార్యాలయంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఒడిశాలోని ప్రభుత్వ కార్యాలయంలో ఘటన
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: ప్రభుత్వ కార్యాలయంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ప్రభుత్వ కార్యాలయ భవనంలోని ఆరోగ్యశాఖ ఛాంబర్లో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సీనియర్ గుమస్తా, డ్రైవర్ కలిపి అకృత్యానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆదివారం కార్యాలయానికి రమ్మన్నారు. అక్కడికి వెళ్లాక ఆదివారం రాత్రి కార్యాలయంలోనే ఉంచి ఇద్దరూ అత్యాచారం చేశారు’ అని సంబల్పూర్కు చెందిన బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం